శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కావళ్లు ధరించిన భక్తులు హరోంహరా అంటూ షణ్ముఖుని సేవించుకున్నారు. నారద పుష్కరణిలో తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. – శ్రీకాళహస్తి
నారదపుష్కరణి వద్ద భక్తులు


