నిరుద్యోగ యువతను బాబు సర్కార్ మోసం చేసింది. డీఎస్సీని అవినీతి అడ్డాగా మార్చుకుని రూ.కోట్లు దండుకుంది. తక్షణం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా పేద విద్యార్థులను వేధిస్తున్నారు. నిరుద్యోగులను భృతి పేరుతో మోసం చేశారు. ఈ క్రమంలోనే చేపట్టిన ర్యాలీకి జిల్లాలోని యువత పెద్దసంఖ్యలో తరలిరావాలి. చేయి చేయి కలుపుకుని చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం.
– చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ
విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
లోకేష్ రాజీనామా చేయాలి
రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం యువతను, విద్యార్థులను సర్వనాశనం చేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువత కడుపుకొట్టింది. ఫీజురీయింబర్స్మెంట్ అందకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. మెగా డీఎస్సీలో అవకతవకలకు కారణమైన మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. ఈ మేరకు తిరుపతిలో చేపట్టే ర్యాలీని విజయవంతం చేయాలి. – ఉదయ్ వంశీ, వైఎస్సార్సీపీ తిరుపతి,
చిత్తూరు జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడు


