– 8లో
సైదాపురం–గూడూరు మార్గంలో కేబుల్ గుంత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మృతుడి కి ఏడాది క్రితమే వివాహమైంది.
నీటి విడుదలను పెంచండి
రాపూరు: చైన్నె నగర ప్రజల దాహదర్తి తీర్చడానికి కండలేరు జలాల విడుదలను పెంచాలని చైన్నె నగర మెట్రో అధికారుల బృందం కండలేరు జలాశయ అధికారులను కోరింది. కండలేరు జలాశయాన్ని చైన్నె మెట్రో అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. వారు మాట్లాడుతూ కండలేరు జలాలు చైన్నె నగరానికి 200 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయని, మరో 500 క్యూసెక్కుల నీరు అదనంగా చేరేలా జలాశయం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకముందు కండలేరు హెడ్రెగ్యులేటర్ను పరిశీలించారు. ప్రస్తుతం కండలేరులో 30.180 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ ఎస్ఈ సుబ్రమణ్యేశ్వరావు తెలిపారు. చైన్నె మెట్రో ఇంజినీరింగ్ డైరెక్టర్ పర్వీజ్, సీఈ వైదేహి, ఎస్ఈ శివకుమార్, కలైసెల్వన్, నందగోపాల్, తెలుగగంగ ఈఈ గజేంద్రరెడ్డి, డీఈఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్, కండలేరు, చైన్నె ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


