సాక్షి టాస్క్ఫోర్స్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం (ఏడీ బిల్డింగ్) వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో భక్తులు నిలదీస్తారనే భయంతో బయటకు కనిపించకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ నాయుడు బయటకు వచ్చి హిందువులకు క్షమాపన చెప్పడంతో పాటు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ నల్లాని బాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ పసుపులేటి సురేష్, పార్టీ బీసీ విభాగం జోనల్ అధ్యక్షుడు వాసుయాదవ్, నాయకులు అరుణ్యాదవ్, అనిల్రెడ్డి, మోహనరాజ్, రమణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


