నేడు ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్
●
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలు రెవెన్యూ సమస్యలతోపాటు పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, రోడ్లు, వీఽధిలైట్లు, పాఠశాల సమస్యలు, శ్మశాన వాటికలు తదితర అన్ని సమస్యలపై అధికారులకు అర్జీలు ఇవ్వవచ్చును. అలాగే సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు(టీటీడీ మినహా) వారి సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అధికారులకు ఇవ్వడానికి అవకాశం కల్పించారు.


