
కేవీబీపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నుంచి అమలు చేసిన ఉచిత బస్సు పథకానికి ఆదరణ కరువైంది. కనీసం కార్యక్రమం ప్రారంభానికి కూడా మహిళలు బస్సుల దగ్గరకు చేరడం లేదు. కండక్టర్లు గొంతులు పోయేలా ఉచిత బస్సు , ఫ్రీ బస్సు అని అరుస్తున్నా మహిళలు పట్టించుకోవడం లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం కేవీబీపురం మండల కేంద్రంలోనిది. ఈ బస్సులో ఉన్నవారు కూడా స్థానికులే అక్కడే ఎక్కించుకుని, పోలీస్ స్టేషన్ దాటి దింపేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి విభిన్న మాటలు వినిపిస్తున్నాయి.