
వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడిగా ఎంపీ మ
తిరుపతి సిటీ:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజవర్గాలకు ఆ పార్టీ పరిశీలకులను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి నియమితులయ్యారు. వైఎస్సాఆర్ కడప జిల్లా నందలూరు మండలం, చెన్నయ్యగారిపల్లెకు చెందిన ఆయన పేరొందిన పారిశ్రామిక వేత్తగా, సీనియర్ రాజకీనాయకులుగా గుర్తింపు పొందారు. 2024లో ఆయ న్ని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసింది.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ
పరిశీలకుడిగా చవ్వా రాజశేఖర్రెడ్డి
తిరుపతి సిటీ: చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం పట్టణానికి చెందిన ఆయన ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో దివంగత నేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచారు. పార్టీకి విధేయుడిగా అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలను గుర్తించి చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడిగా నియమించింది.
ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా రాధ
తిరుపతి తుడా: ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రాధను నియమిస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ బుధవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో డాక్టర్ రాధకు పూర్తి బాధ్యతలను అప్పగించారు.

వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడిగా ఎంపీ మ