రేపు గంగదేవిపాడులో షర్మిల నిరాహార దీక్ష 

YS Sharmila Hunger Strike At Gangadevipadu tomorrow - Sakshi

ఖమ్మం మయూరిసెంటర్‌: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఈ నెల 20వ తేదీన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేత కొండా రాఘవరెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. 20న ఉదయం 8  నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top