హైదరాబాద్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళినగర్ కాలనీకి చెందిన వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్గౌడ్ తనయుడు యువనేత రామకృష్ణగౌడ్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీవీజీ ట్రస్ట్ ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్.అశోక్, శ్రీనివాస్, పరమేష్, బాలు, బాలచందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


