పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం | Father Ends Young Man Life For Loving His Daughter In Peddapalli District, More Details Inside | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం

Mar 28 2025 8:23 AM | Updated on Mar 28 2025 10:24 AM

Young Man Lost His Life In A Love Affair In Peddapalli District

రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్‌ అనే యువకుడిని

సాక్షి, పెద్దపెల్లి జిల్లా: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్‌ అనే యువకుడిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరతోట గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే సాయికుమార్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. దీంతో సాయికుమార్ ఇంట్లో తీవ్ర విషాదం  నెలకొంది.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు‌ను ఏర్పాటు చేశారు.  పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement