
పెద్దపల్లి: ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగమంతా కదిలి అర్హులకు సంక్షేమ పథకాలు అందించినట్లు.. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్తోపాటు అధికార యంత్రాంగం మొత్తం శుక్రవారం మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చేరింది. మీసేవ, ఆధార్ సేవలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్, ఆధార్కార్డులు, కులం, ఆదాయ సర్టిఫికెట్స్, పోస్టల్ ఇన్సూరెన్స్లు, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ చెకప్స్.. ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు. పీఎం ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు.