Paddy Crops: Unseasonal Rains Heavily Damaged Telangana 2022 - Sakshi
Sakshi News home page

Unseasonal Rains: తడిసి ముద్దయిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన

May 4 2022 10:06 AM | Updated on May 4 2022 11:32 AM

Unseasonal Rains Heavily Damaged Telangana 2022 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణలో రైతులను నిండా ముంచెత్తింది. సరిగ్గా పంట, తోటలు చేతికొచ్చే సమయం కావడంతో..  

హైదరాబాద్‌: తెలంగాణలో అకాల వర్షం.. నగరాలు, పట్టణాల్లో కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా  రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రతిఫలం సరిగ్గా చేతికొచ్చే సమయంలో ఈదురుగాలుల వానకి మొత్తం నాశనం అయ్యింది. 
 
బుధవారం వేకువ ఝామున కురిసిన భారీ వానతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వాన ప్రభావాలతో రాష్ట్రంలోని పలు చోట్ల పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. 
 
మరోవైపు కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం సైతం.. టార్ఫిన్లు లేక తడిసి ముద్దయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు పెద్దగా తీసుకోలేదని తెలుస్తోంది. ఇక బుధ, గురువారాల్లో సైతం వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

చదవండి: భారీ వర్షం..  నగరం ఉలిక్కిపడిన వేళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement