TSRTC Cancels Bus Services To AP Due To Curfew In Andhra Pradesh | ఏపీకి వెళ్లే బస్సులు నిలిపేసిన టీఎస్‌ ఆర్టీసీ - Sakshi
Sakshi News home page

ఏపీకి వెళ్లే బస్సులు నిలిపేసిన టీఎస్‌ ఆర్టీసీ

May 6 2021 5:59 PM | Updated on May 6 2021 7:29 PM

TS RTC Stops Bus Services To Andhra Pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను టీఎస్‌ ఆర్టీసీ  నిలిపివేసింది. ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తాత్కాలికంగా తెలంగాణ బస్సులను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగాణ, ఏపీ మధ్య మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిబంధనలు వర్తించనున్నాయని తెలిపింది. నిన్న హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా అధికారులు రద్దు చేశారు.

చదవండి : TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు

Advertisement
 
Advertisement
Advertisement