పోలీసుల చిత్రహింసల వల్లే చిరంజీవి మృతి | DRG Jawan Wife Gets Emotional On Husband Who Died In Maoist Attack | Sakshi
Sakshi News home page

పోలీసుల చిత్రహింసల వల్లే చిరంజీవి మృతి 

Apr 29 2023 2:46 PM | Updated on Apr 29 2023 3:04 PM

DRG Jawan Wife Gets Emotional On Husband Who Died In Maoist Attack - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తుకారాంగేట్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఆమూరి చిరంజీవిని ఈ నెల 25వ తేదీన తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లనే మృతి చెందాడని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. ఈ మేరకు తమ నిజనిర్ధారణలో వెల్లడైనట్లు మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్‌.జీవన్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందజేయాలని, బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుడి భార్య మంజులకు ఉద్యోగం కల్పించి పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేరి్పంచాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement