YS Sharmila To Announce Political Party Name On YSR Jayanthi July 8 - Sakshi
Sakshi News home page

జూలై 8న షర్మిల పార్టీ ఆవిర్భావం 

Jun 8 2021 1:21 AM | Updated on Jun 8 2021 1:14 PM

Telangana: YS Sharmila To Announce Party Name On July 8th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, కార్యక్రమాలను తాము ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు.

షర్మిల తన కొత్త పార్టీని ‘వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ’(వైఎస్సార్‌టీపీ)గా రిజిస్ట్రేషన్‌ చేయించగా పార్టీ పేరుపై తనకు అభ్యంతరం లేదని వైఎస్సార్‌ సతీమణి విజయలక్ష్మి రాసిన లేఖను వైఎస్సార్‌ టీపీ ఈసీకి సమర్పించింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్‌ 30నే కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కోరిందని, ఇప్పటివరకూ ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రక్రియ పూర్తయిందని అనుకుంటున్నామని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement