కేటీఆర్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు | Telangana Womens Commission Send Notices To KTR Over His Comments On Women Travelling In RTC Buses | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

Aug 16 2024 4:15 PM | Updated on Aug 16 2024 5:05 PM

Telangana Womens Commission Send Notices To KTR

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు కమిషన్‌ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్‌ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు చేస్తున్న పనులపై కేటీఆర్‌ కొన్ని కామెంట్స్‌ చేశారు. దీంతో, కేటీఆర్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుని తాజాగా నోటీసులు ఇచ్చింది. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement