పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలి: ఎస్‌టీయూటీఎస్‌ 

Telangana: STUTS Demand Govt To Form PRC Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించి, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ (ఎస్టీయూటీఎస్‌) రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సంఘం అధ్యక్షుడు బి.సదానందంగౌడ్‌ అధ్యక్షతన ఎస్టీయూటీఎస్‌ రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి.

ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్‌ ఇవ్వాలని, వేతనేతర, మెడి­కల్‌ బిల్లులు మంజూరు చేయాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, టీచర్లను బోధనకే పరిమితం చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, స్పౌజ్‌ కేసులను పరిష్కరించాలని కోరింది. ఎమ్మెల్సీగా బరిలోకిదిగిన భుజంగరావుకు ఉపా­­­ధ్యాయులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top