
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల సందర్భంగా ఫామ్ హౌస్లో ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల తెలిపారు.
వివరాల ప్రకారం.. మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫార్మ్ హౌస్లో పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ జరిపారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో దాడుల్లో భాగంగా.. ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.