Bharat Jodo Yatra: తెలంగాణలో నవంబర్‌ 7న ముగింపు | Telangana: Rahul Gandhi Bharat Jodo Yatra Slight Changes In Schedule | Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: తెలంగాణలో నవంబర్‌ 7న ముగింపు

Oct 18 2022 12:50 AM | Updated on Oct 18 2022 12:56 PM

Telangana: Rahul Gandhi Bharat Jodo Yatra Slight Changes In Schedule - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇటీ­వల ఏఐసీసీ సంస్థాగ­త వ్యవహారాల ఇన్‌చా­ర్జి కె.సి.వేణుగోపాల్‌ సమక్షంలో జరిగిన సమావే­శంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి నవంబర్‌ 6 వ­రకు ఈ యాత్ర జరగాల్సి ఉంది. కానీ, తాజామార్పుల ప్రకారం యా­త్ర రాష్ట్రంలో నవంబర్‌ 7న ముగియనుంది.

తాజా షెడ్యూల్‌ ప్ర­కారం.. ఈ నెల 23న ఉద యం 11 గంటలకు నారా­య­ణ­­పేట జిల్లా కృష్ణా మండలం గూడబెల్లూరులో రాహుల్‌గాంధీ తెలం­గా­­ణలో ప్రవేశి­స్తారు. అక్కడి నుంచి మక్తల్‌ వరకు ఆ రోజు యాత్ర సా­గిస్తారు. ఆ తర్వాత దీపావళి సం­­దర్భంగా 3 రోజులు యాత్రకు విరామం ఇచ్చి, 27న మక్తల్‌ నుంచి తిరిగి ప్రారంభిస్తారు. ఆరోజు నుంచి నవంబర్‌ 3 వరకు యాత్ర జరగనుండగా, 4న  విరామం తీసుకోనున్నారు.

మళ్లీ  5న మెదక్‌ జిల్లా అందోల్‌ నియోజకవర్గం చొట్కూరు వద్ద యాత్రను ప్రారంభించి 7వ తేదీ సాయంత్రం ఏడుగంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని షాపూర్‌ మీర్జాపూర్‌ హనుమాన్‌ గుడి వద్దకు చేరుకోవడంతో యాత్ర రాష్ట్రంలో ముగియనుంది. అక్కడి నుంచి ఆయన మహా­రాష్ట్రకు వెళతారు.  

ఫారెస్ట్‌లో.. పది కిలోమీటర్లు
తాజా షెడ్యూల్‌ ప్రకారం రాహుల్‌ గాంధీ పది కిలోమీటర్ల మేర రిజర్వ్‌ ఫారెస్టు ప్రాంతంలో యాత్ర చేయనున్నారు. నవంబర్‌ 7న ఉదయం జగన్నా­థపల్లెలోని జుక్కల్‌చౌరస్తా వద్ద యాత్రను ప్రారంభించనున్న రాహుల్‌ గాంధీ, రిజర్వ్‌ ఫారెస్టు గుండా ప్రయాణించి షాపూర్‌గేట్‌ వద్దకు చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోనున్నారు. రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో 11 చోట్ల జరిగే (కార్నర్‌ మీటింగ్‌లు) సమావేశాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement