రాష్ట్రంలో మరో తొమ్మిది కరోనా కేసులు  | Telangana logs nine COVID 19 positive cases on Friday | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మరో తొమ్మిది కరోనా కేసులు 

Dec 23 2023 4:13 AM | Updated on Dec 23 2023 4:13 AM

Telangana logs nine COVID 19 positive cases on Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన 1,245 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా తొమ్మిది కోవిడ్‌ –19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇందులో 68 నమూనాలకు సంబంధించి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ప్రస్తుతం 27 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏకంగా 8 హైదరాబాద్‌ జిల్లాకు చెందినవి కాగా...ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement