Telangana Covid Updates: కొత్తగా 984 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 40,663 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 984 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.24 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 923 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.14 లక్షలకు చేరింది.