Vikarabad: 80 Years Old Woman Abandoned In Kodangal Bus Stop By Sons - Sakshi
Sakshi News home page

కన్నతల్లి బరువైంది.. రెండు రోజులుగా ఆహారంలేక

Jun 21 2021 7:19 AM | Updated on Jun 21 2021 6:33 PM

Sons Left His Mother On Road At Vikarabad District - Sakshi

కొడంగల్‌: పేగు తెంచుకుని పుట్టిన కొడుకులు తమ కన్నతల్లిని రోడ్డుపై వదిలేశారు. రెండు రోజులుగా ఆహారం లేక, చలికి వణుకుతూ ఆ వృద్ధురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ హృదయ విదారక ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కోస్గి మండలం కడంపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల మహిళను ఆమె కుమారులు రెండు రోజులక్రితం కొడంగల్‌ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అందరూ ఉండి కూడా ఆమె అనాథలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బస్టాండ్‌లోని వ్యాపారులు, పరిసర వాసులు ఆమెకు రెండు రోజులు తిండి పెట్టారు.

ఆదివారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో బస్టాండ్‌లోకి తరలించారు. ఆ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు. 
చదవండి: చిట్టి తల్లికి.. పెద్ద కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement