రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. రాంగోపాల్పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. కేరళకు చెందిన అధిరా అనీష్ (24) కిమ్స్లో నర్సుగా పనిచేస్తూ పీజీరోడ్లోని హాస్టల్లో ఉంటుంది. అధిరా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కేరళ నుంచి పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి వద్దను ఆమెను కలువగా చిన్న విషయానికి వాగ్వవాదం జరిగింది. తాను హాస్టల్కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తల్లి రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?


