
నల్లగొండ: జాతీయ గోల్డ్మెడల్ అవార్డు పొందిన సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్టు కంది భజరంగ్ ప్రసాద్ను మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఛాంబర్లో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భజరంగ్కు ఇప్పటికీ 79 అవార్డులు రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హాఫీజ్ ఖాన్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు క్రిస్టఫర్, డాక్టర్ ఏ ఏ ఖాన్, సౌరయ్య, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.