నేటి సమాజంలో వార్తా విశేషాల్ని తెలుసుకోవడానికి టీవీలు, పేపర్లు పాత్ర చాలా తక్కువైపోయింది. అంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియా వేదికలపై దృష్టి పెడుతున్నారు. వార్తలు, వినోదం, అభిప్రాయాలు ఇలా ఆల్ ఇన్ వన్ తరహాలో అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలు ప్రధాన సమాచార వనరులుగా మారాయి. ప్రధానంగా తక్షణ సమాచారం అందించే సామర్థ్యం ప్రజలను ఆకర్షిస్తోంది. ఫలితంగా యువతలో సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉంది.
సమాజంలో అభిప్రాయాలు, చర్చలు ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా కూడా.
ఈ క్రమంలోనే ఇక్కడ మీతో(ప్రేక్షక్షులకు) ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ‘సాక్షి’ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లలో నెలవారీ వీక్షణలో 100 మిలియన్ల వ్యూయర్షిప్ను సాధించింది.
తెలుగు సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘సాక్షి’ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ఎప్పటికప్పుడు వేగంగా వార్తా సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘సాక్షి’ సోషల్ మీడియాని ఫోలో అవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.


