బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు వినతి 

PRTUTS Requested Minister Sabitha Indra Reddy Over Schedule Of Teacher Transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు మంగళవారం మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top