TS: ప్రాజెక్టులకు భారీ వరద  | Projects Are Full Of Rain Flood Water In Telangana | Sakshi
Sakshi News home page

TS: ప్రాజెక్టులకు భారీ వరద 

Sep 8 2021 2:53 AM | Updated on Sep 8 2021 2:54 AM

Projects Are Full Of Rain Flood Water In Telangana - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద తాలిపేరు ప్రాజెక్ట్‌ నుంచి విడుదలవుతున్న వరదనీరు  

సాక్షి, హైదరాబాద్‌: వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో గోదావరి దాని ఉప నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దీనితో ప్రాజెక్టులన్నీ నిండటంతో.. గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కులకుపైన వరద వస్తోంది. దీనితో 33 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లికి ఏకంగా ఐదున్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 40గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఈ వరదతోపాటు ప్రాణహిత ప్రవాహం కూడా తోడు కావడంతో కాళేశ్వరం బ్యారేజీలకు ఏడు లక్షలకుపైగా వరద కొనసాగుతోంది. 11.50 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 22 గేట్లు ఎత్తి 54,835 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, పోచారం, ఏడుపాయల వనదుర్గ, ఘనపూర్‌ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement