సూర్యాపేటలో మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం | Private travel bus accident in Suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం

Nov 11 2025 2:42 AM | Updated on Nov 11 2025 2:47 AM

Private travel bus accident in Suryapet

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిట్టంపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై (NH-65) మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న విహారి ట్రావెల్స్‌కు చెందిన బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీసులు తెలిపారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. బస్సులో ఉన్న ప్రయాణికులు మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే  బస్సు అద్దాలు తలుపుల నుంచి బయటకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. అయితే, బస్సు పూర్తిగా దగ్ధమైంది.

మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement