సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిట్టంపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై (NH-65) మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న విహారి ట్రావెల్స్కు చెందిన బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీసులు తెలిపారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. బస్సులో ఉన్న ప్రయాణికులు మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సు అద్దాలు తలుపుల నుంచి బయటకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. అయితే, బస్సు పూర్తిగా దగ్ధమైంది.
మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


