​HYD: నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు..కారణమిదే.. | Curfew In Hyderabad And Secunderabad: Police Restrictions In Hyderabad Upto November 28th 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

Curfew In Hyderabad: నగరంలో నెల రోజులు ఆంక్షలు.. సీవీ ఆనంద్‌ ఆదేశాలు

Oct 28 2024 7:33 AM | Updated on Oct 28 2024 10:40 AM

Police Restrictions In Hyderabad Upto November 28 2024

సాక్షి,హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నవంబర్‌ 28 సాయంత్రం ఆరు గంటల దాకా నెల రోజులు  సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్‌) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు.

కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు జరగడం తెలిసిందే. దీనికి తోడు గ్రూప్‌-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్‌ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం. 

ఇదీ చదవండి: జన్వాడ రేవ్‌పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు ఆదేశాలు 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement