సాక్షి,జనగామ: పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా కేవలం కేటీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తామని, మిగిలిన నాయకులు, కార్యకర్తల వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేటీఆర్.. తన వాహనాన్ని రహదారిపైనే నిలిపివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను నెట్టేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పెంబర్తి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


