బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు | Police Arrested Eight Persons In minor girl Incident at adilabad | Sakshi
Sakshi News home page

బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు

Jun 23 2025 11:29 AM | Updated on Jun 23 2025 11:29 AM

Police Arrested Eight Persons In minor girl Incident at adilabad

గుడిహత్నూర్‌: సోషల్‌ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్‌లో చాటింగ్‌ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్‌ వీడియో కాల్‌ చేయాలని, లేదంటే చాటింగ్‌ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. 

ఆ బాలిక ఒకరోజు న్యూడ్‌ కాల్‌చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్‌ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement