NIA Conducts Searches For Terrorist Moments In Karimnagar - Sakshi
Sakshi News home page

ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్‌లో ఎన్‌ఐఏ దాడుల కలకలం..

Aug 10 2023 8:36 AM | Updated on Aug 10 2023 12:26 PM

NIA Conducts Searches In Karimnagar Over Terrorist Moments - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్‌ హుస్సేనిపురా, కర్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలో గురువారం ఉదయం ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. తబ్రేజ్‌ అనే వ్యక్తికి పీఎఫ్‌ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది.

ప్రస్తుతం తబ్రేజ్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. పీఎఫ్‌ఐ టెర్రర్‌ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
చదవండి: మజ్లిస్‌ సెక్యులర్‌ ఎలానో కేసీఆర్‌ చెప్పాలి: కిషన్‌రెడ్డి డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement