పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి | Mounika Family Members Death In KamaReddy District | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Mar 30 2025 9:38 AM | Updated on Mar 30 2025 9:44 AM

Mounika Family Members Death In KamaReddy District

సాక్షి, కామారెడ్డి: ఉగాది పండగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులో మునిగి తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు.

వివరాల ‍ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌కు చెందిన మౌనిక (26) చెరువు వద్ద బట్టలు ఉతుకుతోంది. ఈ క్రమంలో తన బిడ్డలు ముగ్గురూ చెరువులోకి స్నానానికి దిగారు. చెరువు లోతుగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ క్రమంలో తల్లితో పాటు పిల్లలు ముగ్గురూ చెరువులో మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనలో మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement