Delhi Liquor Case: MLC Kavitha Request To Come For ED Inquiry On March 15 - Sakshi
Sakshi News home page

రేపు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

Mar 8 2023 1:02 PM | Updated on Mar 8 2023 3:09 PM

MLC Kavitha Request To Come For ED Inquiry On March 15 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీకి ఎమ్మెల్సీ కవిత.. లేఖ రాశారు. రేపటి విచారణను హాజరు కాలేనని లేఖ కవిత పేర్కొన్నారు. 

వివరాల ప్రకారం.. లిక్కర్‌ స్కా​ం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలో ఈడీకి కవిత లేఖను రాశారు. లేఖలో భాగంగా రేపు(గురువారం) ఈడీ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. కాగా, ఈనెల 15వ లేదీన హాజరు అవుతానని లేఖలో​ వెల్లడించారు. ఈనెల 10వ తేదీన జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ ఫిక్స్‌ అయిన కారణంగా హాజరు కాలేనని తెలిపారు. అందుకే సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ధర్నా కోసం రేపు మధ్యాహ్నం కవిత ఢిల్లీలోకి వెళ్లనున్నారు. ఎల్లుండి జంతర్‌ మంతర్‌ వద్ద కవిత ధర్నాలో పాల్గొననున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement