
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ రాశాడు. చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోట్లు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో మత్తయ్య పేర్కొన్నాడు.
ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మత్తయ్య లేఖ కీలకంగా మారింది. లేఖలోని అంశాలను పిటిషన్ రూపంలో కోర్టులో ఫైల్ చేయనున్న మత్తయ్య తరఫు న్యాయవాది.