‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’ | married woman missing In Hyderabad | Sakshi
Sakshi News home page

‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’

Mar 19 2025 7:31 AM | Updated on Mar 19 2025 2:16 PM

married woman missing In Hyderabad

భర్తకు మెసేజ్‌ చేసి భార్య అదృశ్యం 

హైదరాబాద్: ‘నేను ఇంటికి రాను..నన్ను మరిచిపో’ అని భర్తకు మెసేజ్‌ చేసి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాయిబాబానగర్‌ పాండుబస్తీలో రమేష్‌, మీనాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. మీనాక్షి స్థానికంగా కూరగాయల దుకాణం నిర్వహించేది. ఈ నెల 16న సాయంత్రం  ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.

సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన రమేష్‌ భార్య కనిపించకపోవడంతో ఆమె సెల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అయితే రాత్రి 10.45 గంటలకు ‘నేను ఇంటికి రాను.. నన్ను మరిచిపో’ అంటూ ఆమె భర్తకు మెసేజ్‌ పంపింది. దీంతో రమేష్‌ తన భార్య కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement