సాక్షి, ఢిల్లీ: 22A అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైయిరీ జరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లపాటు సెటిల్మెంట్లు చేసుకొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారన్న ఆయన రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనక ఒక పెద్ద స్కాం ఉంటుందని ఆరోపించారు.
ఆయన మాట్లాడుతూ.."భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారు. 30% కమిషన్లు తీసుకున్న తర్వాత నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఉమ్మడి పౌరస్మృతిపై మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. యూనిఫామ్ అని చెప్పి కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలోనే చట్టం తీసుకు వస్తామనడంలో సహితుకత లేదు" అని ప్రభుత్వాన్ని విమర్శించారు.


