సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కొండాసురేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సచివాలయంలోని కొండా సురేఖ ఛాంబర్కు అధికారులు ఈ రోజు (మంగళవారం) తాళం వేశారు. ఛాంబర్లోని మూడు పేషీలకు తాళం వేశారు. అదే విధంగా కొండా సురేఖ పేషీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి పలువురిని వారి సొంతశాఖలకు పంపారు.
కాగా కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను క్రమశిక్షణ చర్యల పేరుతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఛాంబర్కు సైతం అధికారులు తాళం వేశారు.


