సాక్షి, జగిత్యాల: జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కులపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. కోరుట్ల మండలం అయిలాపూర్లోని ఊరి పొలిమేరల్లో వివాహేతర సంబంధానికి సంబంధించిన పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళను వివస్త్రను చేసి ఆమెపై దాడి చేశారు. శరీరంపై కారం, జీడిరసం పూసి వికృతానందం పొందారు.
అయితే తీవ్రమైన బాధతో బాధితురాలు కేకలు వేస్తున్న కనికరించకుండా పైశాచిక ఆనందం పొందారు. సాటి మహిళలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


