‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’ | KC Venu Gopal Comments On CWC Meeting At Taj Krishna And Thukkuguda Meet, Details Inside - Sakshi
Sakshi News home page

‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’

Sep 15 2023 4:55 PM | Updated on Sep 15 2023 5:45 PM

KC venu Gopal On CW Cmeeting At Taj Krishna And Thukkuguda Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రజలను ఇరిటేట్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్‌నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు.  ఈమేరకు 17న కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు.

ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ విమర్శించారు. రిజర్వేషన్‌ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు.  రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. 
చదవండి: మంత్రి కేటీఆర్‌ మెడిసిన్‌ ఎందుకు చదవలేకపోయారంటే..?

కాంగ్రెస్‌ అగ్రనేతంతా హైదరాబాద్‌కే..
సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల  సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్‌ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్‌ ఆగ్ర నేతలంతా ఈ హోటల్‌లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement