సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బలోపేతం కోసం 14 దేశాల్లో పార్టీ అధ్యక్షులను నియమించినట్టు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వీరిలో కిశోర్ కత్తి (ఆస్ట్రేలియా), సుమన్రావు బల్మూరి (యూకే), వెంకట్రామన్ మెట్పల్లి (కెనడా), తానింకి కిశోర్ యాదవ్ (ఇటలీ), పింటూ ఘోష్ (మాల్టా), ప్రకాశ్ పొన్నకంటి (పోర్చుగల్), శేఖర్ గౌడ్ ఆరె (యూఏఈ), మార్క ప్రమోద్ గౌడ్ (కువైట్), బెమ్మడి మహేందర్ రెడ్డి (జింబాబ్వే), శేఖర్ చిలువూరి (ఖతార్), సందీప్ రెడ్డి ఐరెడ్డి (ఫిన్లాండ్), ప్రసాద్రావు బిక్కినేని (నార్వే), మొజ్జం అలీ ఇఫ్తేకర్ (సౌదీ అరేబియా), జయంత్ రెడ్డి మెట్టు (ఐర్లాండ్) వీరితోపాటు మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ను నియమించినట్టు పేర్కొన్నారు.


