హైదరాబాద్: ఆటో కార్మిక సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ అర్థరాత్రి నుంచి తలపెట్టాలనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
ఆటో కార్మిక సంఘాలు ఆటోల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దీనిలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాలు తమ బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఫలితంగా ఆటో కార్మికులు యధావిధిగానే సేవలు అందించనున్నారు.


