సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రోజు ( ఆదివారం) అర్థరాత్రి నుంచి ఆటోల బంద్ చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్లు ప్రకటించారు. ఈ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బంద్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


