క‌రోనా బాధితుల‌కే క‌రువైందంటే.. చేపలకు ఆక్సిజన్‌! 

Karimnagar: Fisherman Provided Oxygen To Fish And Sold It - Sakshi

సాక్షి, శంకరపట్నం(మానకొండూర్‌): కరోనా బాధితులకు ఆక్సిజన్‌ దొరక్క ఆస్పత్రుల్లో మృత్యువాత పడుతున్న ప్రస్తుత తరుణంలో కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలో ఓ మత్స్యకారుడు ఆదివారం చేపలకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేసి విక్రయించాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మత్స్యకారుడు పప్పు ప్రభాకర్‌ చేపలు విక్రయించేందుకు ట్రాక్టర్‌లో వాటర్‌ట్యాంక్‌ ఏర్పాటు చేసి దానికి ఆక్సిజన్‌ బిగించాడు. బతికిఉన్న చేపలు కొనడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారని, అందుకే చేపలకు ఇలా ఆక్సిజన్‌ అందిస్తూ విక్రయిస్తున్నట్లు తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top