ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, పంచాయతీ కార్యదర్శి, బిల్‌ కలెక్టర్‌.. | kamalapur Tahsildar Sircilla, Nanajipur Officers caught Taking Bribe | Sakshi
Sakshi News home page

ఓచోట తహసీల్దార్‌, మరోచోట పంచాయతీ కార్యదర్శి, బిల్‌ కలెక్టర్‌.

May 20 2024 7:11 PM | Updated on May 20 2024 7:25 PM

kamalapur Tahsildar Sircilla, Nanajipur Officers caught Taking Bribe

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్‌ తహసీల్దార్‌ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్‌ 30,000 డిమాండ్‌ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్‌ తహసిల్దార్‌ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.

అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్‌ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. 

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement