IT Raids On Telangana Minister Malla Reddy House in Hyderabad - Sakshi
Sakshi News home page

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌.. ఒకేసారి 50 బృందాలతో..

Nov 22 2022 7:41 AM | Updated on Nov 22 2022 2:54 PM

IT Raids at Telangana Minister Malla Reddy Houses at Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

మల్లారెడ్డి సోదరుడు, వియ్యంకుడి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ లావాదేవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్రాంతి బ్యాంక్‌ ఛైర్మన్‌ రాజేశ్వర్‌రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.   

చదవండి: (బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులు?)

Advertisement
 
Advertisement
Advertisement