సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్ | Increased Tourist Traffic To Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్

Aug 11 2024 5:13 PM | Updated on Aug 11 2024 5:39 PM

Increased Tourist Traffic To Nagarjuna Sagar

నాగార్జున సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్‌ పరిసర ప్రాంతాదలు కిటకిటలాడాయి. ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా అంబులెన్స్‌ ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోవడంతో రోగి, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సు ఉన్నవారిని మాత్రమే డ్యామ్ పైకి పంపుతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement