
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను బలవన్మరణానికి పాల్పడింది(Balanagar Mother Kills Children). మరణించిన చిన్నారులు కవలలుగా తెలుస్తోంది.
బాలానగర్ పద్మారావునగర్ ఏరియాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను హతమార్చి.. ఆపై నివాసం ఉంటున్న బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను కార్తీకేయ(2) లాస్యత వల్లి(2), సాయిలక్ష్మిగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: నాన్నమ్మ మందలింపు, భార్యాకొడుకుతో కలిసి రైలు కింద పడి..