మహిళ ప్రాణం తీసిన ‘చెత్త’ పనులు..! | Garbage Dumping Cause To Death A Woman In Narayankhed | Sakshi
Sakshi News home page

మహిళ ప్రాణం తీసిన ‘చెత్త’ పనులు..!

Dec 20 2020 1:31 PM | Updated on Dec 20 2020 7:47 PM

Garbage Dumping Cause To Death A Woman In Narayankhed - Sakshi

తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్‌ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు.

సాక్షి, సంగారెడ్డి: నారాయణ్‌ ఖేడ్‌ మున్సిపల్‌ అధికారుల నిర్వాకం ఓ మహిళ మృతికి కారణమైంది. ఇంటిపన్ను కట్టలేదని ఓ ఇంటి ముందు నారాయణ్‌ ఖేడ్‌ పురపాలక సంఘం అధికారులు నాలుగు రోజుల క్రితం చెత్త వేశారు. దీంతో ఇంటి యజమానురాలు భూమవ్వ (58) తీవ్ర మనస్తాపం చెందారు. ఈరోజు (ఆదివారం) ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జోగిపేట్‌ వద్దకు చేరుకోగానే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. అధికారుల మితిమీరిన చర్యల వల్లే భూమవ్వ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్‌ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement