హైదరాబాద్: నగరంలోని రామంతాపూర్లో మద్యం లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై లారీని నిలిపివేశాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలు మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోగా.. మరో వైపు మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు.